ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: ఈసీకి విజయసాయి ఫిర్యాదు

  • నేడు సీఈసీని కలిసిన విజయసాయి
  • ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని వినతి
  • తండ్రి హత్య కేసు విషయమై ఈసీని కలిసిన సునీత
టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నేడు సీఈసీని కలిసిన విజయసాయి... ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆయన సీఈసీని కోరారు. అలాగే నేటి ఉదయం సీఈసీని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కలిశారు. తన తండ్రి హత్య కేసు విషయంలో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదని ఆమె ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
CEC
Telugudesam
Vivekananda Reddy
suneetha

More Telugu News